PDPL: కాళేశ్వరంలో ఈనెల 7 నుంచి 9 వరకు జరిగే మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు, కాలేశ్వరం ఆలయ ఉప ప్రధాన అర్చకులు ఫణింద్ర శర్మ అన్నారు. తుని తపోవనం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి వారి కరకమలములతో శతచండీ మహారుద్ర సహిత సహస్రఘటాభిషేకం నిర్వహిస్తారని చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి కుంభాభిషేకంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.