KMR: వార్డు సభ్యులు శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని తమ వార్డులను అభివృద్ధి పథంలో నడిపించాలని మండల ప్రత్యేక అధికారి రామ్మోహన్ సూచించారు. శుక్రవారం మద్నూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన శిక్షణలో ఆయన పాల్గొన్నారు. ఇక్కడ నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలన్నారు.