SRPT: మోతే మండలం రాఘవపురం గ్రామంలోని గ్రామ పంచాయతీలో గుర్తుతెలియని వ్యక్తులు మొదటి పాలకవర్గ సభ్యుల శిలాఫలకాన్ని పగలగొట్టి ధ్వంసం చేశారు. ఈ ఘటనపై మాజీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని, పబ్లిక్ ఆస్తులను ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి కఠినంగా చర్యలు తీసుకోవాలని అధికారులను గ్రామస్థులు కోరారు.