KNR: ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు నేటి నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జమ్మికుంటలో ఏర్పాటు చేసిన 3 పరీక్ష కేంద్రాల్లో జనరల్ విద్యార్థులు 424, వొకేషనల్ విద్యార్థులు 245 మంది హాజరుకానున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.