VKB: దిర్సంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థిని అక్షిత రెడ్డి జాతీయ స్థాయి ఖో-ఖో పోటీలకు ఎంపికై అరుదైన గుర్తింపు సాధించింది. ప్రస్తుతం HYDలోని బేగంపేట్ మహిళా డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న అక్షిత, ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఖో-ఖో టోర్నమెంట్లో అద్భుత ప్రతిభ కనబరిచి ఈ అవకాశం దక్కించుకుంది.