JN: బచ్చన్నపేట మండలం లింగంపల్లి చెందిన బొడ్డు ప్రవీణ్, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. జగన్ మరోసారి సీఎం కావాలని కోరుతూ తెలంగాణ వ్యాప్తంగా 100 దేవాలయాల్లో మోకాళ్లపై నడుస్తూ ప్రతి ఆలయంలో 100 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. శుక్రవారం కొడవటూరు సిద్దేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాడు.