KMR: గాంధారి మండలం నేరేల్ తండా గ్రామపంచాయతీ ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని ఛైర్మన్ బండారు రమేశ్ శనివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కందులకు క్వింటాలుకు రూ. 8,000 మద్దతు ధర నిర్ణయించిందని తెలిపారు. రైతులకు మేలు చేసేందుకే ఈ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రవీందర్, ఉప సర్పంచ్ నెహ్రూ ఉన్నారు.