నల్గొండ: జిల్లా పోలీసు శాఖలో పదవి విరమణ పొందిన SI దుర్గా రెడ్డి, ఆసాయి ఫరీద్, నిరంజన్లను ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఘనంగా సన్మానించారు. విధి నిర్వహణలో వారి సేవలు ప్రశంసనీయమని ఎస్పీ పేర్కొని శాలువాలు, జ్ఞాపికలు అందజేశారు. అలాగే విధి నిర్వహణలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పోలీస్ సిబ్బంది షేక్ తాయూబ్, మరియాదాస్ కుటుంబ సభ్యులకు చేయూత చెక్కులు అందజేశారు.