సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎండల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. బుధవారం మధ్యాహ్నం నమోదైన ఉష్ణోగ్రతల వివరాల ప్రకారం సంగారెడ్డిలో అత్యధికంగా 37.5°C ఉష్ణోగ్రత నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో గుమ్మడిదల 35.9°C, పటాన్చెరు 35.6°C,రామచంద్రపురం 34.8°C, అమీన్పూర్లో 34.6°C గా రికార్డు అయింది. గాలిలో తేమశాతం 39.5% గా ఉండడంతో ఉక్కపోత కూడా తోడైంది.