KNR: చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో పోసిన వరి ధాన్యం నీటిలో కొట్టుకుపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత పది రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉన్నా, కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతోనే నష్టం జరిగిందని రైతులు అంటున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు.