KMM: నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెంలో శనివారం ఓ పిచ్చి కుక్క స్వైర విహారం చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. దొరికిన వారిని దొరికినట్లే కరవడంతో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. దీంతో కొందరు యువకులు ఆ పిచ్చికుక్కను వెంబడించి కర్రలతో కొట్టి చంపారు. దాడిలో గాయపడ్డ వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.