BDK: పాల్వంచ మండలంలోని గడిపాడు గ్రామంలో శ్రీ దేవి గోదా దేవి సమేత శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి వారి ఆలయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. గురువారం ఈ పవిత్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని ప్రత్యేక పూజలు, హోమాలలో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది.