PDPL: టీబీ రహిత తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని జిల్లా టీబీ చికిత్స సీనియర్ పర్యవేక్షకులు దేవ తిరుపతి తెలిపారు. బుధవారం పెద్దపల్లి మండలం రాగినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని నిమ్మనపల్లిలో ప్రభుత్వం నిక్షయ్ శిబిర్ 100 రోజుల పథకంలో భాగంగా టీబీ శిబిరాన్ని నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీపీఎం ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.