KMM: వినియోగదారులు కొనుగోలు చేసే ప్రతి వస్తువుకు రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని హ్యూమన్ రైట్స్ సభ్యులు కోట వెంకట్, కన్నెపోగు వెంకటేశ్వర్లు (కెవిఆర్) కె ఆంజయ్యలు తెలిపారు. ఆదివారం అంతర్జాతీయ వినియోగదారులు దినోత్సవం సందర్భంగా మధిర పట్టణంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. కాలం చెల్లిన వస్తువులు అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.