WNP: శ్రీరంగాపురం మండల కేంద్రంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో గురువారం ధ్వజారోహణం జరుగుతుందని అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా గరుడ ప్రసాద వితరణ నిర్వహిస్తారు. సంతానం లేని దంపతులు ప్రసాదం స్వీకరిస్తే ఫలితం ఉంటుందని వేద పండితులు పేర్కొన్నారు. భక్తులు ఉదయం 10 గంటలకు ఆలయానికి రావాలని వారు కోరారు.