BHNG: రామన్నపేట మండల కేంద్రంలో రూ.10.00 లక్షల వ్యయంతో, జనంపల్లి గ్రామంలో రూ.20.00 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వేముల వీరేశం సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మెరుగైన రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.