SDPT: చేర్యాల పోలీస్ స్టేషన్ ఎస్సైగా అపూర్వరెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆమె తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు, జూదం, అక్రమ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి మొగ్గు చూపుతామన్నారు.