KNR: గంగాధర మండలం ఒద్యారం గ్రామ పంచాయతీలో గురువారం రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ రైతు గుర్తింపు కార్డు గురించి వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయ భూమి కలిగి ఉన్న ప్రతీ రైతు ఫార్మర్ రిజస్ట్రీని ఫిబ్రవరి 28లోగా నమోదు చేసుకోవాలని రైతులకు వ్యవసాయ అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో గోపి చంద్, సర్పంచ్ ఉమ పాల్గొన్నారు.