ADB: ఖానాపూర్ నియోజకవర్గంలోని సదర్మాట్, కడెం ఆయకట్టుల పరిధిలో ఉన్న చివరి పొలాల వరకు సాగునీటిని అందించాలని రైతులు కోరారు. సదర్మాట్ పరిధిలో కడెం, ఖానాపూర్, కడెం ప్రాజెక్టు పరిధిలో దస్తురాబాద్, కడెం, జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల్లో ఉన్న రైతులు యాసంగి సీజన్లో వరి, తదితర పంటలు వేశారు. ఆ పంటల పూర్తి వరకు నీటిని అందించాలని రైతులు కోరారు.