WGL: మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి వల్లందాసు కుమార్ డిమాండ్ చేశారు. క్వింటాకు రూ.2400 మద్దతు ధరతో కొనుగోలు చేపట్టాలని అన్నారు. కొనుగోలు చేయకపోవడంతో పౌల్ట్రీ నిర్వాహకులు ఇదే అదునుగా భావించి క్వింటాకు రూ.1600 నుంచి రూ.1900 మాత్రమే చెల్లిస్తున్నారని వాపోయారు.