NLG: శాలిగౌరారం మండలంలోని గురుజాలలో గల శ్రీవిశాలాక్ష సమేత కాశీవిశ్వ నాథేశ్వరస్వామి ఆలయ తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి రెండు రోజులపాటు ఘనంగా జరుగనున్నాయి. ఇవ్వాళ గణపతిపూజ, పంచామృత అభిషేకం, పుణ్యా హవాచనం, నవగ్రహ పూజ, అంకురార్పణ, కంకణధారణ, కూశ్మాండభవధనం, గ్రామ దర్శనం కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఉత్సవ నిర్వాహకులు తెలిపారు.