సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మురికి నీరు రోడ్డుపై పారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని 39వ వార్డులో మురికి కాలువలో నుంచి నీరు రోడ్డుపై ప్రవహించడంతో కాలనీ వాసులతోపాటు ద్విచక్ర వాహనదారులు, ప్రజలు నడిచేందుకు ఇబ్బందుల గురవుతున్నారు. సిబ్బంది వెంటనే సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.