BHNG: శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవం సందర్భంగా భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో గోటి తలంబ్రాలు కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. కల్యాణ మహోత్సవం సందర్భంగా గురువారం సాయంత్రం మహిళా భక్తులు గోరింటాకును తెంచి రోకలితో నూరారు. ముత్తయిదువలకు పసుపు కుంకుమలు పెట్టి కాళ్లకు మైదాకు పారాణి పెట్టారు.