KMM: వైరా నియోజకవర్గంలోని గిరిజన తండాలు, ఎస్సీ కాలనీల్లోని నిరుపేదలకు పక్కా గూడు కల్పించడమే లక్ష్యమని బుధవారం MLA రాందాస్ నాయక్ పేర్కొన్నారు. లబ్ధిదారుల సంఖ్యను 5 వేలకు పెంచాలని శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.