MNCL: బెల్లంపల్లిలోని వ్యవసాయ మార్కెట్ PDS గోదాం హమాలీల సమస్యలు పరిష్కరించాలని అధ్యక్షుడు రాజలింగు డిమాండ్ చేశారు. సోమవారం హమాలీల సమస్యలపై విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. కూలీరెట్ల పెంపు, పని గంటలు తగ్గించాలని, బరువులు మోసే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులు, భద్రత ఏర్పాట్లు, తాగునీరు, విశ్రాంతి సౌకర్యాల కల్పనలపై సమగ్రంగా చర్చించారు.