WGL: పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో దోమల నివారణకు సర్పంచ్ తక్కలపల్లి శ్రీనివాస్ చర్యలు చేపట్టారు. ఆదివారం గ్రామ పరిధిలోని డ్రైనేజ్ కాలువల్లో GP సిబ్బంది చేత బ్లీచింగ్ పౌడర్ చల్లి, దోమల నివారణ మందును పిచికారీ చేయించారు. దోమల వల్ల డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు సోకకుండా గ్రామస్థుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు.