NZB: చందూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించే 30 పడకల ఆసుపత్రికి నేడు వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ అగ్రో ఇండస్ట్రియల్ ఛైర్మన్ గారు కాసుల బాలరాజు భూమి పూజ చేయనున్నారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ తెలిపారు. కావున పార్టీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు.