HNK: శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవస్థానంలో 16 రకాల పుష్పాలతో అమ్మవారికి పుష్పయాగం నిర్వహించారు. శ్రీ సీతారామ చంద్రస్వామి వారి కళ్యాణ వైభవ ప్రతి ఘట్టాన్ని ఆలయ వేదపండితులు నాగిళ్ళ షణ్ముఖ పద్మనాభ అవధాని, శిష్యబృందం గోపీకృష్ణ శర్మ, రంజిత్ ఆచార్యులు నిర్వహించారు. పద్మాక్షి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు సదానందం, సంతోష్, వినయ్, నాగరాజు సుమారు 300 మందికి అన్నప్రసాదాన్ని అందించారు.