KMR: తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య శనివారం పిట్లం మండలంలో పర్యటించారు. మండలంలోని బుర్నాపూర్ గ్రామానికి వెళ్తున్న క్రమంలో పిట్లం చేరుకున్న ఆయనకు జిల్లా అధికార యంత్రాంగం స్వాగతం పలికింది. కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఛైర్మన్కు పుష్పగుచ్ఛాలు అందించి సాదరంగా ఆహ్వానించారు.