ADB: గుడిహత్నూర్ మండలం మచ్చపూర్ గ్రామంలో శ్రీ హనుమాన్ మందిర 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కబడ్డీ టోర్నమెంట్ పోటీలు ముగిశాయి. గెలుపొందిన క్రీడాకారులకు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల్ గౌడ్ బహుమతులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందన్నారు. యువకులు జిల్లా, రాష్ట్రస్థాయిలో సైతం రాణించాలని ఆకాంక్షించారు.