కామారెడ్డి జిల్లాలో 195 అబాండెడ్ వాహనాలను బహిరంగ వేలం వేయనున్నట్లు ఎస్పీ రాజేష్ చంద్ర ప్రకటించారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో మాట్లాడుతూ.. డిస్ట్రిక్ట్ పోలీస్ యాక్ట్-1861 సెక్షన్ 26 ప్రకారం ఈ చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాహన యజమానులకు తమ హక్కులను క్లెయిమ్ చేసుకోవడానికి ఆరు నెలల గడువు ఉంటుందని, ఈలోపు క్లెయిమ్ చేసుకోకపోతే బహిరంగ వేలం వేస్తామని ఆయన పేర్కొన్నారు.