KMM: వెలుగుమట్ల భూదాన్ భూముల నిర్వాసితుల సర్వేలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు కోసం కలెక్టర్ అనుదీప్ ఆధ్వర్యంలో 22 మంది తహశీల్దార్లు విచారణ చేపట్టారు. మొత్తం 600 మందిలో కేవలం 180 మందే స్థానికులు కాగా, మిగిలిన 420 కుటుంబాలు కొంతమంది ఇతర జిల్లాలు, మరికొంత మంది ఏపీకి చెందినవారని తేలింది.