WNP: కొత్తకోట మండలంలోని ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలోని వంట గదిలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆహారాన్ని తప్పనిసరిగా గ్యాస్ స్టవ్ పై మాత్రమే వండాలని సిబ్బందికి ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. ఆహారం విద్యార్థులకు వడ్డించే ముందు సూపర్వైజర్ తప్పనిసరిగా రుచి చూసి తర్వాతనే అందించాలన్నారు.