ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో నూతనంగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కోసం నిర్వహించిన “ప్రజాపాలన – ప్రగతి నివేదిక” శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు పారదర్శకంగా చేరవేసేలా ప్రజాప్రతినిధులకు ఈ సందర్భంగా ఆయన దిశానిర్దేశం చేశారు.