NZB: ధర్పల్లి మండలంలో ఉగాది, రంజాన్ పండుగలను ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్సై సామా శ్రీనివాస్ మంగళవారం సూచించారు. పండుగలు మత సామరస్యాన్ని చాటేలా ఉండాలని, ఒకరికొకరు సహకరించుకుంటూ ఆనందంగా గడపాలని కోరారు. జిల్లా సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు మండలంలోని సమస్యాత్మక గ్రామాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.