NLG: మిట్ట వేసవిలో శాలిగౌరారం ప్రాజెక్టుకు నీరు తీసుకురావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చామల యాదగిరి రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన తనయుడు చామల వెంకటరమణ రెడ్డి సాగునీటి సరఫరాకు విశేష కృషి చేస్తున్నారని రైతులు కొనియాడారు. రబీ, ఖరీఫ్ పంటలకు నీరు అందేలా చొరవ చూపినందుకు కృతజ్ఞతగా ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.