PDPL: సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డులో అమృత్ 2.0 పథకంలో భాగంగా, చేపట్టిన పైపులైన్ పనులను కౌన్సిలర్ గాజుల రాజమల్లు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి దృష్ట్యా వార్డు ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పైపులైన్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. దశలవారీగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు.