BDK: రాష్ట్రవ్యాప్తంగా డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం శనివారం కీలక అప్డేట్ ఇచ్చింది. త్వరలోనే ఇళ్లు పూర్తి చేసి, పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. ఇళ్ల పనులు పూర్తి చేసి పేదలకు కేటాయించాలని అలాగే పట్టణాల్లోని పేదలకు వారి సమీప ప్రాంతాల్లోనే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రణాళికలు రచిస్తున్నారు.