నిజామాబాద్ జిల్లాలోనీ ధర్పల్లి మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో 2026 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థుల ప్రవేశ దరఖాస్తు గడువు మార్చి 10వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.