WGL: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇవాళ దుగ్గొండి రైతు వేదికలో నిర్వహించిన ఒకరోజు సర్పంచుల శిక్షణ కార్యక్రమంలో అదనపు రెవిన్యూ కలెక్టర్ సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి, పారదర్శక పాలన, ప్రభుత్వ పథకాల సమర్థ అమలు వంటి అంశాలపై సర్పంచులకు మార్గదర్శనం చేశారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సర్పంచులకు సూచించారు.