GDWL: ఆడుతూ పాడుతూ పాఠశాలకు రావాల్సిన చిన్నారి.. అనారోగ్యంతో తిరిగిరాని లోకాలకు వేలింది. మల్దకల్ మండలం సద్దలోనిపల్లి గ్రామానికి చెందిన పేగుల గోపాల్ కుమార్తె చందు(13) శుక్రవారం కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అమరవాయి జడ్పీహెచ్ఎస్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న ఈ విద్యార్థిని మరణవార్త తెలియగానే పాఠశాలలో విషాద ఛాయలు అలముకున్నాయి.