WNP: అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలో మాజీ ప్రధాని వాజ్ పేయి శత జయంతి వేడుకలను బీజేపీ నాయకులు బుధవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బీజేపీ జెండా కట్ట వద్ద బీజేపీ నాయకులు ఎం.రాజు, క్యామ భాస్కర్ వాజ్ పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ దేశానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు.