WNP: మధుమేహం ఎక్కువ కాలం నియంత్రణలో లేకపోతే కంటి రెటీనా దెబ్బతిని చూపుకోల్పోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మధుమేహ బాధితుల ఆరోగ్యం బాగు కోసం ‘దృష్టి’ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్న వయసులోనే షుగర్, రెటినోపతి వంటి సమస్యలు వస్తున్నాయి అన్నారు. అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి.