NZB: ఆర్మూర్ మున్సిపాలిటీలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా పాలన’ కార్యక్రమం తొలి రోజే వివాదాస్పదమైంది. ఎన్నికైన మహిళా కౌన్సిలర్ల స్థానంలో వారి భర్తలతో మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు ప్రతిజ్ఞ చేయించారు. మహిళా సాధికారత అంటూ ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్రస్థాయిలో ‘పతుల పాలన’ సాగుతోందని విమర్శలు వెలువెత్తుతున్నాయి.