KMM: కారేపల్లిలో రోడ్డు భద్రతపై ‘అరైవ్ అలైవ్’ రెండో విడత అవగాహన కార్యక్రమం జరిగింది. రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి పర్యవేక్షణలో ఎస్సై గోపి వాహనదారులకు, ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై సూచనలు చేశారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని ఆయన హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు.