NGKL: మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాతృమూర్తి మంగమ్మ ఇవాళ మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చల్లంపల్లి గ్రామానికి వెళ్లి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ను పరామర్శించారు. అనంతరం మంగమ్మ భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఎమ్మెల్యే వెంట పొల్యూషన్ బోర్డు మెంబర్ ఠాగూర్ బాలాజీసింగ్, తదితరులు ఉన్నారు.