KNR: గంగాధర మండలం గర్షకుర్తి గ్రామంలోని వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు ఎమ్మెల్యేను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ కమిటీ నిర్వాహకులు ఎమ్మెల్యేను సన్మానించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ అంబటి రజిత పాల్గొన్నారు.