MLG: మంగపేట మండలం రమణక్కపేట నూతన పంచాయతీ కార్యదర్శిగా జి.రంజిత్ కుమార్ నియామకం అయ్యారు. ప్రస్తుతం ఉన్న కార్యదర్శి కోరం రాజు తాడ్వాయి మండలం బంధాల పంచాయతీకి బదిలీ అయ్యారు. ప్రస్తుతం రంజిత్ కుమార్ కన్నాయిగూడెం మండలం గుర్రేవుల పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈయన రేపు బాధ్యతలు తీసుకోనున్నట్లు సమాచారం.