MHBD: జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. నేడు ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు కీలకమైన గణితం, బాటనీ, సివిక్స్ పరీక్షలు జరుగాయి. మాల్ ప్రాక్టీస్కు తావులేకుండా సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం తనిఖీలు చేపట్టారు.