MNCL: లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావు పేట, చందారం, దౌడేపల్లి గ్రామాలలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సుడిగాలి పర్యటన నిర్వహించారు. మంగళవారం ఆయన ఆయా గ్రామాలలో పర్యటించి పారిశుధ్య పనులను పరిశీలించారు. అలాగే నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. వెంకట్రావు పేట పీహెచ్ సీని సందర్శించి వైద్యుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.